Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 09:11 AM

నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
09-08-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి.


నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌ స్వరూప్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం.. నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది.

ప్రమాదం ధాటికి డీసీఎం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో డ్రైవర్‌ స్వరూప్‌ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Sthanikam

నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

Article Image

ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి.


నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్‌ స్వరూప్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం.. నార్కట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది.

ప్రమాదం ధాటికి డీసీఎం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో డ్రైవర్‌ స్వరూప్‌ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News