ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న డీసీఎం.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ స్వరూప్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాకినాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం.. నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది.
ప్రమాదం ధాటికి డీసీఎం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో డ్రైవర్ స్వరూప్ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి