రైతులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని స్పష్టం చేశారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు.విద్యుత్ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం.
నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా లైన్మెన్లు వెల్పర్లకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి స్థానంలో ఇతరులను విధుల్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యవహారాలను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.
ఏఈలు, డీఈలు క్షేత్రస్థాయికి వెళ్లాలి:
విద్యుత్ శాఖలోని ఏఈలు, డీఈలు కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.విద్యుత్ పరికరాల కొరత లేకుండా చూడాలి:ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, ఇతర విద్యుత్ పరికరాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచి విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి