Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 07:19 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
08-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని స్పష్టం చేశారు.


రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు.విద్యుత్ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం.


నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా లైన్మెన్లు వెల్పర్లకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి స్థానంలో ఇతరులను విధుల్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యవహారాలను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

ఏఈలు, డీఈలు క్షేత్రస్థాయికి వెళ్లాలి:

విద్యుత్ శాఖలోని ఏఈలు, డీఈలు కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.విద్యుత్ పరికరాల కొరత లేకుండా చూడాలి:ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, ఇతర విద్యుత్ పరికరాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచి విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.


Sthanikam

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Article Image

రైతులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని స్పష్టం చేశారు.


రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు.విద్యుత్ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం.


నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా లైన్మెన్లు వెల్పర్లకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి స్థానంలో ఇతరులను విధుల్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యవహారాలను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

ఏఈలు, డీఈలు క్షేత్రస్థాయికి వెళ్లాలి:

విద్యుత్ శాఖలోని ఏఈలు, డీఈలు కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.విద్యుత్ పరికరాల కొరత లేకుండా చూడాలి:ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, ఇతర విద్యుత్ పరికరాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచి విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News