జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారిపై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కోదాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గొర్రె రాజేష్ మాట్లాడుతూ చేనేత కార్మికులను వేధిస్తున్న ‘జియోట్యాగ్’ నిబంధనను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించడంతో పాటు చేయూత అందించాలని కోరారు. అలాగే మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 లక్షల భీమా పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పద్మశాలి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సంగిశెట్టి గోపాల్ , నక్క చంద్రం, కొంగరి నరసింహారావు, రుద్ర నాగలక్ష్మి, అనబత్తుల వేణు, ఆనంద్ వెంకట్రావు, పంతంగి నరేష్, కాండూరి వీరభద్రం, ఎలగందుల రాఘవయ్య, చిట్టిపోలు గిరిప్రసాద్, గోలి నాగరాజు, బుద్ధవరపు శేషగిరిరావు, ఎలగందుల నర్సింహారావు, కొంగరి సైదులు, రుద్ర రామచంద్రం, నక్క రామయ్య, కల్వకుంట్ల రత్నకుమార్, మారేపల్లి రాంబాబు, యామిని వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి