నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై అవగాహన
ప్రతి ఇంటా చెత్త విభజనతో స్వచ్ఛ గ్రామ నిర్మాణానికి పిలుపు.
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ లో స్వచ్ఛ గ్రామ నిర్మాణమే లక్ష్యంగా బోగారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై ప్రత్యేక అవగాహన
గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మన గ్రామం–మన బాధ్యత" అనే భావనతో ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి తదితర వ్యర్థాలుగా వేరు చేసి, ఆయా చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. చెత్తను శాస్త్రీయంగా విభజించడం వల్ల గ్రామంలో పరిశుభ్రత పెరగడంతో పాటు దోమలు, ఈగలు వ్యాప్తి తగ్గి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండగలరని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, కనుక మల్లేష్, చిరగోని శిల్పా, నవీన్ యాదవ్, వనం అండాలు యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, సంఘబంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, భోగ సంధ్య, గ్రామ పెద్దలు కూనూరు మహేష్ గౌడ్, బైకాని మహేష్ యాదవ్, మేడి కృష్ణ, మేడి ముఖేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి