సంఘ భవనం వద్ద మువ్వన్నెల పతాకావిష్కరణ చేసిన అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు
స్థానిక చౌటుప్పల చేనేత సహకార సంఘం భవనం వద్ద శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బడుగు మోహన్ బాబు చేనేత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా చౌటుప్పల పురపాలక సంఘ చైర్మన్ మొగుదాల పావని రమేష్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొండా లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గుర్రం నరసింహ విచ్చేసి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సంఘ ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, కోశాధికారి బడుగు సావిత్రి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి