నల్లగొండ, ఆగస్టు 6: నర్సింగ్ భట్ల గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సంఘ అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిణి జోత్స్న గురువారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.
సంఘంలో మొత్తం 158 మంది సభ్యులు ఉండగా, ఎన్నికల్లో 136 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నికలో అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ అంబటి మల్లయ్య కుమారుడు అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.
గ్రామ చరిత్రలో తొలిసారిగా మత్స్య సహకార సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి నాలుగు తరాలకు చెందిన సభ్యులు తరలివచ్చి ఓటు వేయడం విశేషంగా మారింది.
ఎన్నికల సందర్భంగా ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి