Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని ‘కప్ప కావడి’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 03:10 PM

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు
07-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఆగస్టు 6: నర్సింగ్ భట్ల గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సంఘ అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిణి జోత్స్న గురువారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.

సంఘంలో మొత్తం 158 మంది సభ్యులు ఉండగా, ఎన్నికల్లో 136 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నికలో అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ అంబటి మల్లయ్య కుమారుడు అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.

గ్రామ చరిత్రలో తొలిసారిగా మత్స్య సహకార సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి నాలుగు తరాలకు చెందిన సభ్యులు తరలివచ్చి ఓటు వేయడం విశేషంగా మారింది.

ఎన్నికల సందర్భంగా ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

Sthanikam

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు

Article Image

నల్లగొండ, ఆగస్టు 6: నర్సింగ్ భట్ల గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సంఘ అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిణి జోత్స్న గురువారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.

సంఘంలో మొత్తం 158 మంది సభ్యులు ఉండగా, ఎన్నికల్లో 136 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నికలో అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ అంబటి మల్లయ్య కుమారుడు అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.

గ్రామ చరిత్రలో తొలిసారిగా మత్స్య సహకార సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి నాలుగు తరాలకు చెందిన సభ్యులు తరలివచ్చి ఓటు వేయడం విశేషంగా మారింది.

ఎన్నికల సందర్భంగా ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News