సదాశివపేటలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం
సదాశివపేటలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా, లింగాష్టక పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం పట్టణంలోని ఒక్కో ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, శ్రీ చెన్న బసవేశ్వర మందిరం అధ్యక్షుడు జీర్లపల్లి వెంకన్న, ఆలయ అర్చకులు అశోక్ స్వామి, కమిటీ సభ్యులు దోనూర్ పాండురంగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాచన్నా స్వామి, ప్రేమ్ కుమార్, త్రిమూర్తి, వరుణ్ మల్లికార్జున్, అనిల్ కుమార్, మహావీర్తో పాటు మహిళా సభ్యులు సరిత, భాభిత, చైతన్య, అశ్విని, పద్మ, జగదంబ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి