Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద మహిళలకు చీరల పంపిణీ స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 08:11 PM

గణనాథుని సన్నిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

గణనాథుని సన్నిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

గణనాథుని సన్నిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు
15-09-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని గణనాథుని ప్రార్థించారు. ప్రజల రక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించాలని, విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అలాగే పోలీసు సిబ్బంది కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని కోరుకున్నారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు జనార్దన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గణనాథుని సన్నిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

Article Image

సంగారెడ్డి జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని గణనాథుని ప్రార్థించారు. ప్రజల రక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించాలని, విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అలాగే పోలీసు సిబ్బంది కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని కోరుకున్నారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు జనార్దన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News