సెప్టెంబర్ 17న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వం, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సాగిన పోరాటంలో వేలాది గ్రామాలు వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందడంతోపాటు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత ఉందన్నారు. సుమారు నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి విముక్తి దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గాధగాని మాణిక్యం, మండల సహాయ కార్యదర్శులు ముసుకు పెంటారెడ్డి, ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, పశువుల నర్సింహ, మంచాల రాధమ్మ, బొడిగె సుదర్శన్, సుధాగాని వెంకన్న, ఎండీ పాషా, కంచర్ల మల్లయ్య, దేవల్ల బాలరాజు, మంచాల మాధవి, మంచాల సువర్ణ, ఎండీ యూసుఫ్, దూశెట్టి అండాలు, బండి అనసూయ, పంగక అండాలు, సోపరి సోములు, రవీందర్రెడ్డి, సాయిలు, నర్సింలు, స్వామి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి