Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 06:28 PM

రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవు:చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవు:చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవు:చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
16-09-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​'గాంధీగిరి'తో మున్సిపల్ అధికారుల వినూత్న నిరసన!

పరిశుభ్రత మన బాధ్యత... బహిరంగంగా పడేస్తే జరిమానా!

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ మున్సిపాలిటీ హెచ్చరించింది. జాతీయ రహదారి (NH 65) వలిగొండ జంక్షన్ నుంచి లింగోజిగూడెం వెళ్లే రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తున్న వారిని మున్సిపల్ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. ​ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది వినూత్నంగా స్పందించారు. రహదారి పక్కన చెత్త వేస్తూ దొరికిన నలుగురు వ్యక్తులకు మర్యాదపూర్వకంగా పూలదండలు వేసి ('గాంధీగిరి' పద్ధతిలో) అవగాహన కల్పించారు. రహదారుల పక్కన చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేస్తూనే, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ​రోజూ విధులకు వెళ్లే కొంతమంది వ్యక్తులు మార్గమధ్యలో చెత్త పడేస్తుండటం వల్ల, సిబ్బంది సమయమంతా దాన్ని శుభ్రం చేయడానికే సరిపోతోందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకే చెత్తను అందించి, పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవు:చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

​'గాంధీగిరి'తో మున్సిపల్ అధికారుల వినూత్న నిరసన!

పరిశుభ్రత మన బాధ్యత... బహిరంగంగా పడేస్తే జరిమానా!

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ మున్సిపాలిటీ హెచ్చరించింది. జాతీయ రహదారి (NH 65) వలిగొండ జంక్షన్ నుంచి లింగోజిగూడెం వెళ్లే రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తున్న వారిని మున్సిపల్ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. ​ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది వినూత్నంగా స్పందించారు. రహదారి పక్కన చెత్త వేస్తూ దొరికిన నలుగురు వ్యక్తులకు మర్యాదపూర్వకంగా పూలదండలు వేసి ('గాంధీగిరి' పద్ధతిలో) అవగాహన కల్పించారు. రహదారుల పక్కన చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేస్తూనే, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ​రోజూ విధులకు వెళ్లే కొంతమంది వ్యక్తులు మార్గమధ్యలో చెత్త పడేస్తుండటం వల్ల, సిబ్బంది సమయమంతా దాన్ని శుభ్రం చేయడానికే సరిపోతోందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకే చెత్తను అందించి, పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News