సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం..
రెయిన్ కోట్లు పంపిణీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అంకితభావంతో పనిచేసే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. వర్షాకాలంలో విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి బుధవారం రెయిన్ కోట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నప్పటికీ రవాణా నియంత్రణ, బందోబస్తు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.
ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, మౌలిక వసతులు కల్పించడం శాఖ బాధ్యత అని స్పష్టం చేశారు. విధి నిర్వహణతో పాటు సిబ్బంది తమ ఆరోగ్యం పట్లా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, శ్రీనుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి