Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బస్సులు గ్రామంలోకి రావాలి.. కళాశాల విద్యార్థులు ప్రజల డిమాండ్ బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 08:34 PM

నిజాం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య.

నిజాం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య.

నిజాం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య.
16-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సెప్టెంబర్‌ 16: నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర సాయుధ పోరాటాన్ని బీజేపీ మతాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేటలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం రైతులు, కూలీలు, పేద ప్రజలు సాగించిన వీరోచిత ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు.

ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని వీరయ్య తెలిపారు. సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని, వారి త్యాగాలతో వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పట్లో ఎలాంటి పాత్ర లేకపోయినా, నేడు చరిత్రకు మతపరమైన రంగు పులుముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం అసలు చరిత్రను పక్కదారి పట్టిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ ప్రజల వీరోచిత పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాస్తవ చరిత్రను యువతకు తెలియజేయాలని వీరయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిజాం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య.

Article Image

రామన్నపేట, సెప్టెంబర్‌ 16: నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర సాయుధ పోరాటాన్ని బీజేపీ మతాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్‌. వీరయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేటలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం రైతులు, కూలీలు, పేద ప్రజలు సాగించిన వీరోచిత ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు.

ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని వీరయ్య తెలిపారు. సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని, వారి త్యాగాలతో వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పట్లో ఎలాంటి పాత్ర లేకపోయినా, నేడు చరిత్రకు మతపరమైన రంగు పులుముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం అసలు చరిత్రను పక్కదారి పట్టిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ ప్రజల వీరోచిత పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాస్తవ చరిత్రను యువతకు తెలియజేయాలని వీరయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News