Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
త్రిశూల్ యూత్ వినాయక మండపానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాక బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 07:29 PM

విముక్తి పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. బండారు దత్తాత్రేయ

విముక్తి పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. బండారు దత్తాత్రేయ

విముక్తి పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి.  బండారు దత్తాత్రేయ
16-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫొటో ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు.నిజాం పాలనలో ప్రజలపై జరిగిన దమనకాండ, విముక్తి పోరాటంలో సమరయోధుల పాత్ర, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన క్రమాన్ని వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి దత్తాత్రేయ ప్రదర్శనను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శనను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక అనేక త్యాగాలు ఉన్నాయని అన్నారు. రాంజీగోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి యోధుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాంచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రుతి పాటిల్‌, సమీర్‌ నందా, రాజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విముక్తి పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. బండారు దత్తాత్రేయ

Article Image

హైదరాబాద్‌ విముక్తి పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫొటో ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు.నిజాం పాలనలో ప్రజలపై జరిగిన దమనకాండ, విముక్తి పోరాటంలో సమరయోధుల పాత్ర, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన క్రమాన్ని వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి దత్తాత్రేయ ప్రదర్శనను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శనను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక అనేక త్యాగాలు ఉన్నాయని అన్నారు. రాంజీగోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి యోధుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాంచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రుతి పాటిల్‌, సమీర్‌ నందా, రాజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News