Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 05:24 PM

బీసీ కవిత్వానికి 25 ఏళ్లు. ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’కు ఘన గుర్తింపు.

బీసీ కవిత్వానికి 25 ఏళ్లు. ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’కు ఘన గుర్తింపు.

బీసీ కవిత్వానికి 25 ఏళ్లు. ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’కు ఘన గుర్తింపు.
16-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌ సెప్టెంబర్ 16 స్థానికం ప్రతినిధి :

బీసీ కవుల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ 2001లో వెలువడిన ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’ కవిత్వ సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో 23 మంది కవుల రచనలతో వెలువడిన ఈ సంకలనం బీసీ కవిత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. బీసీ కులాల అస్తిత్వాన్ని ప్రతిబింబించిన ఈ సంకలనం గత 25 ఏళ్లుగా ఎంతోమంది కవుల సృజనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

20న ‘బీసీ కలాల అలాయి బలాయి’

ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘బీసీ కలాల అలాయి బలాయి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ కవులు, కవయిత్రులు, రచయితలు, సామాజికవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య ఆర్‌.రత్నమంజుల, డాక్టర్‌ చెనగోని వెంకట్‌గౌడ్‌, డాక్టర్‌ డి.కిషన్‌, డాక్టర్‌ రాచమళ్ల శ్రీను, అద్దంకి ఆంజనేయులు, డి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ కవిత్వానికి 25 ఏళ్లు. ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’కు ఘన గుర్తింపు.

Article Image

హైదరాబాద్‌ సెప్టెంబర్ 16 స్థానికం ప్రతినిధి :

బీసీ కవుల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ 2001లో వెలువడిన ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’ కవిత్వ సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో 23 మంది కవుల రచనలతో వెలువడిన ఈ సంకలనం బీసీ కవిత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. బీసీ కులాల అస్తిత్వాన్ని ప్రతిబింబించిన ఈ సంకలనం గత 25 ఏళ్లుగా ఎంతోమంది కవుల సృజనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

20న ‘బీసీ కలాల అలాయి బలాయి’

ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘బీసీ కలాల అలాయి బలాయి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ కవులు, కవయిత్రులు, రచయితలు, సామాజికవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య ఆర్‌.రత్నమంజుల, డాక్టర్‌ చెనగోని వెంకట్‌గౌడ్‌, డాక్టర్‌ డి.కిషన్‌, డాక్టర్‌ రాచమళ్ల శ్రీను, అద్దంకి ఆంజనేయులు, డి.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News