Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 05:21 PM

పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు!

పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు!

పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు!
03-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వారం రోజులుగా వృథాగా వేల లీటర్ల తాగునీరు

శ్రీ కంఠమహేశ్వర కాలనీలో బురదమయమైన బాటలు

తీవ్ర ఇబ్బందుల్లో స్థానికులు, వాహనదారులు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కంఠమహేశ్వర కాలనీలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీ స్థానికులకు నరకాన్ని చూపుతోంది. గత వారం రోజులుగా ప్రధాన పైప్‌లైన్ పగిలి వేల లీటర్ల విలువైన తాగునీరు వృథాగా రోడ్లపైకి చేరుతోంది. నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో రోడ్డు కాస్తా చెరువును తలపిస్తోంది.

ఇళ్లకు అందని నీరు.. రోడ్డుపై చెరువు!

ఒకపక్క పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే, ఇక్కడ ఇలా వేల లీటర్ల నీరు వీధులపాలవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా తమ ఇళ్లకు వచ్చే మంచినీటి సరఫరాలో ప్రెషర్ తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. నిలిచిన నీటితో రోడ్డంతా బురదమయంగా మారడంతో పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కాలినడకన వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోందని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టి, దెబ్బతిన్న రోడ్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

పైప్‌లైన్ పగిలి.. వీధుల పాలైన తాగునీరు!

Article Image

వారం రోజులుగా వృథాగా వేల లీటర్ల తాగునీరు

శ్రీ కంఠమహేశ్వర కాలనీలో బురదమయమైన బాటలు

తీవ్ర ఇబ్బందుల్లో స్థానికులు, వాహనదారులు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కంఠమహేశ్వర కాలనీలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీ స్థానికులకు నరకాన్ని చూపుతోంది. గత వారం రోజులుగా ప్రధాన పైప్‌లైన్ పగిలి వేల లీటర్ల విలువైన తాగునీరు వృథాగా రోడ్లపైకి చేరుతోంది. నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో రోడ్డు కాస్తా చెరువును తలపిస్తోంది.

ఇళ్లకు అందని నీరు.. రోడ్డుపై చెరువు!

ఒకపక్క పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంటే, ఇక్కడ ఇలా వేల లీటర్ల నీరు వీధులపాలవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ కారణంగా తమ ఇళ్లకు వచ్చే మంచినీటి సరఫరాలో ప్రెషర్ తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. నిలిచిన నీటితో రోడ్డంతా బురదమయంగా మారడంతో పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కాలినడకన వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారు. రోజుల తరబడి రోడ్డుపైనే నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వస్తోందని, దోమలు విపరీతంగా పెరిగిపోయాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆవేదన చెందుతున్నారు. వాటర్ వర్క్స్, మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పైప్‌లైన్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టి, దెబ్బతిన్న రోడ్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News