Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:04 AM

ఆరు గ్యారెంటీ ల పేరుతో ఓట్లు... అమలులో మాత్రం కోతలు...

ఆరు గ్యారెంటీ ల పేరుతో ఓట్లు... అమలులో మాత్రం కోతలు...

ఆరు గ్యారెంటీ ల పేరుతో ఓట్లు... అమలులో మాత్రం కోతలు...
03-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కోదాడ నియోజకవర్గ స్థాయి నిరసన ధర్నాను బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి, అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ రూపొందించిన “బాకీ కార్డులను” ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, అధికారంలోకి రావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు ఇచ్చిందని విమర్శించారు. ఆ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్‌లో భూకబ్జాలు, అవినీతి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు కోదాడ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గులాబీ జెండా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.

Sthanikam

ఆరు గ్యారెంటీ ల పేరుతో ఓట్లు... అమలులో మాత్రం కోతలు...

Article Image

కోదాడ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కోదాడ నియోజకవర్గ స్థాయి నిరసన ధర్నాను బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చి, అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ రూపొందించిన “బాకీ కార్డులను” ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, అధికారంలోకి రావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు ఇచ్చిందని విమర్శించారు. ఆ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని, బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేసిందని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్‌లో భూకబ్జాలు, అవినీతి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటోందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు కోదాడ నియోజకవర్గంలోని గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గులాబీ జెండా ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News