చిట్యాల ఎస్బీఐని సందర్శించిన డీజీఎం ప్రియబ్రత మిశ్రా.
చిట్యాల: ఖాతాదారుల భద్రతకు కేవైసీ (KYC) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఎస్బీఐ డీజీఎం ప్రియబ్రత మిశ్రా సూచించారు. గురువారం చిట్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంకు వ్యాపార లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాల మంజూరు, ఖాతాదారులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బ్యాంకు వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తున్న శాఖ మేనేజర్ బొజ్జగాని సతీష్, సిబ్బందిని డీజీఎం అభినందించి బహుమతిని అందజేశారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకు వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. ఖాతాదారుల భద్రత, బ్యాంకింగ్ సేవల సౌలభ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. ఇందుకు బ్యాంకు అధికారులు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ఖాతాదారులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలపై అవగాహన కల్పించి, వాటిని విస్తృతంగా వినియోగదారుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి పథకాల ప్రయోజనాలను ఖాతాదారులకు వివరించాలని చెప్పారు.
కార్యక్రమంలో ఆర్ఎం పద్మ బాబు గౌడ్, చిట్యాల శాఖ మేనేజర్ బొజ్జగాని సతీష్, ఫీల్డ్ ఆఫీసర్ కొల్లాబత్తిని సిసిర, క్యాషియర్ చింతకుంట్ల మహేందర్, మణికంఠ, యాదగిరి, చంద్రశేఖర్, రోష్ నారా, కమల, ప్రవీణ్, కొల్లోజు వెంకటేశ్వర్లు, స్వర్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి