నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని డేగుల్వాడి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) శ్వేత గ్రామంలోని రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు చేసిన పంటల రకం, విస్తీర్ణం తదితర వివరాలను నమోదు చేశారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించి నమోదు ప్రక్రియకు సహకరించాలని ఆమె సూచించారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందే వివిధ ప్రయోజనాలు సకాలంలో అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబారి శ్రీనివాస్తో పాటు రైతులు బసాపురం మైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిద్ధార్థ్, చాకలి సంజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పంట నమోదు ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనసాగిస్తున్నారు.
డేగుల్వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన
డేగుల్వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని డేగుల్వాడి గ్రామంలో పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) శ్వేత గ్రామంలోని రైతుల పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సాగు చేసిన పంటల రకం, విస్తీర్ణం తదితర వివరాలను నమోదు చేశారు. రైతులు తమ పంటలకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించి నమోదు ప్రక్రియకు సహకరించాలని ఆమె సూచించారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందే వివిధ ప్రయోజనాలు సకాలంలో అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కరోబారి శ్రీనివాస్తో పాటు రైతులు బసాపురం మైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సిద్ధార్థ్, చాకలి సంజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పంట నమోదు ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనసాగిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి