Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:24 PM

వైఎస్సార్‌ను మరవం.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా’

వైఎస్సార్‌ను మరవం.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా’

వైఎస్సార్‌ను మరవం.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా’
02-09-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కొత్తవాళ్లు వచ్చి కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోను.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్‌రెడ్డి.


మునుగోడు: వైఎస్సార్‌ ఆశయాలే తనకు స్ఫూర్తి అని, ఆయన చూపిన బాటలోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలోని పరిణామాలు, భవిష్యత్‌ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వైఎస్సార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన ఆశయాల కోసం నిరంతరం పాటుపడతానని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌ శిష్యులమైన తాము ఆయనను మరవబోమని స్పష్టం చేశారు.

‘సీఎం.. సీఎం’ అంటున్నారు.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. అలాంటి ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనన్నారు.

నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని, వైఎస్సార్‌ రాజ్యాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల కూడా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన వారి ఆధిపత్యంపై, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం తగ్గడంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


Sthanikam

వైఎస్సార్‌ను మరవం.. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తా’

Article Image

కొత్తవాళ్లు వచ్చి కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోను.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్‌రెడ్డి.


మునుగోడు: వైఎస్సార్‌ ఆశయాలే తనకు స్ఫూర్తి అని, ఆయన చూపిన బాటలోనే రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలోని పరిణామాలు, భవిష్యత్‌ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వైఎస్సార్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన ఆశయాల కోసం నిరంతరం పాటుపడతానని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌ శిష్యులమైన తాము ఆయనను మరవబోమని స్పష్టం చేశారు.

‘సీఎం.. సీఎం’ అంటున్నారు.. సమయం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన కొందరు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన.. అలాంటి ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనన్నారు.

నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తానని రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని, వైఎస్సార్‌ రాజ్యాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల కూడా రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన వారి ఆధిపత్యంపై, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం తగ్గడంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News