Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:58 PM

కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కీలక భేటీ

కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కీలక భేటీ

కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కీలక భేటీ
02-09-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే అంశాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం.

Sthanikam

కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కీలక భేటీ

Article Image

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మర్యాదపూర్వకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించే అంశాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News