చిట్యాల: అయూబ్నగర్ కాలనీలో చిన్నారితో కలిసి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే కూర్చుని ఏడుస్తున్న ఓ మహిళను గమనించిన స్థానికులు రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ కు
సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మహిళ వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెను స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి పోలీసుల సమక్షంలో పూర్తి వివరాలు సేకరించారు.
మహిళ స్వగ్రామానికి వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తన సొంత ఖర్చుతో అందించి అండగా నిలిచారు.
ఆపదలో ఉన్న మహిళకు మానవతా దృక్పథంతో సహాయం చేసిన కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ను పోలీసులు, స్థానిక కాలనీవాసులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి