Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:56 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చౌటుప్పల్ ట్రాఫిక్ సి.ఐ. వెంకటేష్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చౌటుప్పల్ ట్రాఫిక్ సి.ఐ. వెంకటేష్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చౌటుప్పల్ ట్రాఫిక్ సి.ఐ. వెంకటేష్
26-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం లింగోజిగూడెం సమీపంలోని శ్రీని ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు 'రోడ్డు భద్రత - ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన' కార్యక్రమాన్ని నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎక్కువ భాగం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం వల్ల జరిగే నష్టాలను ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఫార్మా సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చౌటుప్పల్ ట్రాఫిక్ సి.ఐ. వెంకటేష్

Article Image

రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం లింగోజిగూడెం సమీపంలోని శ్రీని ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు 'రోడ్డు భద్రత - ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన' కార్యక్రమాన్ని నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎక్కువ భాగం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం వల్ల జరిగే నష్టాలను ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఫార్మా సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News