నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన టి.వై.జె.ఎఫ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో యూనియన్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ పటేల్, రెడ్డి వినోద్, హల్గే రాజు, మండల అధ్యక్షులు ఎన్. ప్రకాష్, లాల్ కుమార్, మధురుద్దీన్, సంజు, సుకల్తీర్ సర్పంచ్ నీలేష్ తదితరులు షేక్ జలీల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, సన్నిహితులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి
షేక్ జలీల్ తల్లి మృతికి యూనియన్ నాయకుల ప్రగాఢ సానుభూతి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రానికి చెందిన టి.వై.జె.ఎఫ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ తల్లి హఠాత్తుగా మృతి చెందడంతో యూనియన్ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ పటేల్, రెడ్డి వినోద్, హల్గే రాజు, మండల అధ్యక్షులు ఎన్. ప్రకాష్, లాల్ కుమార్, మధురుద్దీన్, సంజు, సుకల్తీర్ సర్పంచ్ నీలేష్ తదితరులు షేక్ జలీల్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎల్లప్పుడూ తమ అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, స్థానిక నాయకులు, సన్నిహితులు పాల్గొని కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి