Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:32 AM

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం
26-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్, ఆగస్టు 25 (స్థానికం): ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. అలేటి సుజాత (25) భర్తతో గొడవ కారణంగా చంపాపేటలోని తన తల్లి వెంకటమ్మ వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఈ నెల 16న రాత్రి 9.30 గంటల సమయంలో సుజాత తన తల్లి కుటుంబ సభ్యులతో గొడవపడి.. తన ఇద్దరు పిల్లలు అలేటి చిట్టిబాబు (6), అలేటి నవ్యశ్రీ (1.5)లను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.

దీంతో సుజాత తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి:

మహిళ సుజాతతో పాటు ఇద్దరు చిన్నారులను ఎవరైనా చూసినా, వారి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ శ్రీశైలం కోరారు.

Sthanikam

ఇద్దరు చిన్నారులతో మహిళ అదృశ్యం

Article Image

ఎల్బీనగర్, ఆగస్టు 25 (స్థానికం): ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. అలేటి సుజాత (25) భర్తతో గొడవ కారణంగా చంపాపేటలోని తన తల్లి వెంకటమ్మ వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఈ నెల 16న రాత్రి 9.30 గంటల సమయంలో సుజాత తన తల్లి కుటుంబ సభ్యులతో గొడవపడి.. తన ఇద్దరు పిల్లలు అలేటి చిట్టిబాబు (6), అలేటి నవ్యశ్రీ (1.5)లను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు.

దీంతో సుజాత తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి:

మహిళ సుజాతతో పాటు ఇద్దరు చిన్నారులను ఎవరైనా చూసినా, వారి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ శ్రీశైలం కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News