సదాశివపేట పట్టణ పరిధిలోని ఈరోజు మంగళవారం ఉదయం 11:00 గంటలకు డబుల్ బెడ్ రూమ్ వద్ద గల బృహత్ పట్టణ ప్రకృతి వనం లో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.దానికిగాను చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, ఎరుకల నరసింహులు , పులిమామిడి మమత , మునిపల్లి సత్యనారాయణ , గారెల తుల్జారాం ,రహమద్ , పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రజలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“చెట్లను నాటుదాం – పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి