ఈ నెల 23న నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్లో పుట్టపర్తికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. స్థానిక SSS స్కూల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు.
U-21 కేజీ విభాగంలో తేజేష్, జయాన్స్ గోల్డ్ మెడల్స్ సాధించగా.. హవిష్ కృష్ణ సిల్వర్, పార్థు బ్రాంజ్ మెడల్ సాధించారు.
U-28 కేజీ విభాగంలో పృథ్వి, ముకేశ్ కుమార్ రెడ్డి గోల్డ్ మెడల్స్, లోహిత్ సిల్వర్ మెడల్ సాధించారు.
35 కేజీల విభాగంలో సూర్య గోల్డ్ మెడల్, అలేఖ్య సిల్వర్ మెడల్ సాధించగా.. 75 కేజీల విభాగంలో వేదవర్ధన్ రెడ్డి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మాస్టర్ దినేష్ను కూడా అభినందిస్తూ విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాస్టర్ దినేష్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమన్నారు. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల ఘన విజయం పుట్టపర్తికి గర్వకారణంగా నిలిచిందని తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి