భువనగిరి: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు భువనగిరి SLNS కళాశాల విద్యార్థులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో BJYM భువనగిరి పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్కుమార్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ, BJYM ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణాచారి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గాయపాక పృథ్వీ, రమేష్కోటి, బొల్లారం మధు, కొత్త భారత్ తదితరులతో పాటు SLNS కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి