నాగోల్: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాలు కీలకమని ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ బి. శ్రీనివాసులు అన్నారు. ‘నేను సైతం 2.0’లో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీతో కలిసి కెమెరాలను ప్రారంభించారు.
కృషినగర్లోని పల్లవి డీబీఆర్ అపార్ట్మెంట్స్లో 30, రాఘవేంద్రనగర్ కాలనీ, తట్టి అన్నారం డబుల్ బెడ్రూమ్, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో మరో 44 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు నేరాల నియంత్రణతోపాటు నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగపడతాయని డీసీపీ తెలిపారు.
2.58 లక్షల కెమెరాలు..
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ‘నేను సైతం 2.0’ ద్వారా ఇప్పటివరకు 2,58,457 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఎల్బీనగర్ జోన్లో 81,183 కెమెరాలు ఏర్పాటు చేయగా.. 104 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ బి. నవీన్రెడ్డి, ఎస్ఐలు పి. శివనాగ ప్రసాద్, ఉమ, కాలనీ ప్రతినిధులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి