Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దమ్మగుడి రంగుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 06:15 PM

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్
11-08-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బహుజన ప్రజా సమితి (బీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు బీపీఎస్ అధ్యక్షుడు అడ్వకేట్ చింతకుంట్ల హరిబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

గొట్టిపర్తి మండల కేంద్రంగా ఏర్పాటైతే పరిసర గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. జలాల్ పురం, రావులపల్లి తండా, రాఘవపురం, రావులపల్లి, గొట్టిపర్తి, మామిడాల, మానాపురం తండ తదితర గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నూతన మండల కేంద్రం ఏర్పాటుతో మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా వారాంతపు అంగడి ఏర్పాటుతో పాటు కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కొత్త రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర నిత్యావసరాలు స్థానికంగానే లభించే అవకాశం ఉంటుందని అన్నారు.గొట్టిపర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం కేవలం పరిపాలనా సౌకర్యం మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయం అని బహుజన ప్రజా సమితి నాయకులు పేర్కొన్నారు.

సాధన కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు గొట్టిపర్తి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు, యువత, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చింతకుంట్ల నాగేష్, పరమేష్, తడకమల్ల యాకయ్య, అవిలయ్య, సురేష్, అశోక్, బన్నీ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి;బహుజన ప్రజా సమితి డిమాండ్

Article Image


గొట్టిపర్తిని నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బహుజన ప్రజా సమితి (బీపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు బీపీఎస్ అధ్యక్షుడు అడ్వకేట్ చింతకుంట్ల హరిబాబు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

గొట్టిపర్తి మండల కేంద్రంగా ఏర్పాటైతే పరిసర గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. జలాల్ పురం, రావులపల్లి తండా, రాఘవపురం, రావులపల్లి, గొట్టిపర్తి, మామిడాల, మానాపురం తండ తదితర గ్రామాల ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నూతన మండల కేంద్రం ఏర్పాటుతో మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిధంగా వారాంతపు అంగడి ఏర్పాటుతో పాటు కొత్త దుకాణాలు, వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కొత్త రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, భూముల విలువ పెరగడంతో పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, ఇతర నిత్యావసరాలు స్థానికంగానే లభించే అవకాశం ఉంటుందని అన్నారు.గొట్టిపర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం కేవలం పరిపాలనా సౌకర్యం మాత్రమే కాదు.. చుట్టుపక్కల గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే నిర్ణయం అని బహుజన ప్రజా సమితి నాయకులు పేర్కొన్నారు.

సాధన కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

గొట్టిపర్తి నూతన మండల కేంద్రం ఏర్పాటు సాధన కమిటీ ఆధ్వర్యంలో నేడు గొట్టిపర్తి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు, యువత, రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చింతకుంట్ల నాగేష్, పరమేష్, తడకమల్ల యాకయ్య, అవిలయ్య, సురేష్, అశోక్, బన్నీ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News