శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు
ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో పనులు
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ల సహకారంతో చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 17వ వార్డును అన్ని రంగాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు తెలిపారు. 17వ వార్డు కౌన్సిలర్ ఉమామహేశ్వరి, కో-ఆప్షన్ సభ్యుడు పస్తం గంగరాములు పర్యవేక్షణలో వార్డులోని కల్లేట్ల నాగరాజు, వీరయ్య ఇళ్ల సమీపంలో విరిగి, ప్రమాదకరంగా మారిన రెండు పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త స్తంభాలను నాటించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డులో ఎదురవుతున్న విద్యుత్, ఇతర ప్రజాసమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రమాదకర స్థితిలో ఉన్న స్తంభాల వల్ల స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నూతన స్తంభాలను ఏర్పాటు చేయించినట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాదాని గోపాల్, 17వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.కె. యూసఫ్, వార్డు ప్రముఖులు కల్లేట్ల నాగరాజు, ఎర్రబోతు దయాకర్ రెడ్డి, ఎం.డి. తాజుద్దీన్, ఇమ్మడి ఈశ్వర్, రేవెల్లి రామచంద్రం, లైన్మెన్ తిరుమలేష్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి