Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 01:11 PM

జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం
10-08-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కుటుంబ సభ్యులపై కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ

అంబర్‌పేట శ్రీనివాస్‌ యాదవ్‌

బీసీ నాయకుడు జానయ్య యాదవ్‌ కుటుంబానికి తాము అండగా ఉంటామని అంబర్‌పేట శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జానయ్య యాదవ్‌ కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదు చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని రాజకీయంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.జానయ్య యాదవ్‌ పెద్ద కుమారుడిపై కేసు నమోదు చేశారని, ఆయన భార్యకు బెయిల్‌ వచ్చినప్పటికీ మళ్లీ కేసు పెట్టారని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఎలాంటి తప్పు తెలియని ఎంబీబీఎస్‌ చదువుతున్న చిన్న కుమారుడిపైనా కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.

కుటుంబాన్ని వేధించడం సరికాదు

ఒక కుటుంబంలోని సభ్యులపై వరుసగా కేసులు నమోదు చేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. జానయ్య యాదవ్‌ కుటుంబానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

వివక్షకు తావులేకుండా చూడాలి

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే అలాంటి వ్యక్తులకు రక్షణ కల్పిస్తూ, మరోవైపు సామాజిక వర్గాల కోసం మాట్లాడుతున్న వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

జానయ్య యాదవ్‌ కుటుంబానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ మద్దతు ఉంటుందని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల విషయంలో న్యాయపరమైన పోరాటానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. బీసీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Sthanikam

జానయ్య యాదవ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

Article Image

కుటుంబ సభ్యులపై కేసులతో వేధిస్తున్నారని ఆరోపణ

అంబర్‌పేట శ్రీనివాస్‌ యాదవ్‌

బీసీ నాయకుడు జానయ్య యాదవ్‌ కుటుంబానికి తాము అండగా ఉంటామని అంబర్‌పేట శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జానయ్య యాదవ్‌ కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదు చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని రాజకీయంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.జానయ్య యాదవ్‌ పెద్ద కుమారుడిపై కేసు నమోదు చేశారని, ఆయన భార్యకు బెయిల్‌ వచ్చినప్పటికీ మళ్లీ కేసు పెట్టారని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఎలాంటి తప్పు తెలియని ఎంబీబీఎస్‌ చదువుతున్న చిన్న కుమారుడిపైనా కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.

కుటుంబాన్ని వేధించడం సరికాదు

ఒక కుటుంబంలోని సభ్యులపై వరుసగా కేసులు నమోదు చేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. జానయ్య యాదవ్‌ కుటుంబానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

వివక్షకు తావులేకుండా చూడాలి

బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే అలాంటి వ్యక్తులకు రక్షణ కల్పిస్తూ, మరోవైపు సామాజిక వర్గాల కోసం మాట్లాడుతున్న వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

జానయ్య యాదవ్‌ కుటుంబానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ మద్దతు ఉంటుందని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల విషయంలో న్యాయపరమైన పోరాటానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. బీసీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News