సికింద్రాబాద్, ఆగస్టు 10:
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో సికింద్రాబాద్ జోన్ సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న శాంతి, సంక్షేమ కార్యక్రమాలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కమిటీ ప్రెసిడెంట్ ఎస్. నారాయణ రెడ్డితో పాటు కమిటీ సభ్యులను ఏఐసీసీ సభ్యురాలు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాకేష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పీస్ కమిటీ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి