PRINT TIME: August 01, 2026 08:00 PM
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్
August 01, 2026 05:42 PM
76 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని ముర్కుంజాల్ గ్రామం 8వ వార్డులో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గైని శరణప్పకు చెందిన ఇల్లు గోడలు, పైకప్పు తడిసి కూలిపోయాయి. ఈ ఘటనతో ఆయన కుమారులు గైని తుకారాం, గైని యాదయ్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అండగా నిలవాలని, ఇళ్ల మంజూరులో వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, కిష్టయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి