సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్
సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్
స్థానికం బృందం
సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న యువ సర్పంచ్
ప్రభుత్వం కాదు, సంకల్పమే బలం – సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధి చేస్తున్న యువ సర్పంచ్
రామన్నపేట స్థానిక ప్రతినిధి
చేయాలనే తపన ఉంటే అభివృద్ధి ఆగదని బోగారం గ్రామ యువ సర్పంచ్ కునూరు సాయికుమార్ నిరూపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.
పదవి లేనప్పుడే పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల మధ్యే తిరుగుతూ సమస్యలను గుర్తించిన సాయికుమార్, సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఉత్సాహంతో పనులు వేగవంతం చేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఏండ్ల నాటి సమస్యగా మారిన వికాస్ ఫంక్షన్ హాల్ నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఉన్న గ్రామపంచాయతీ రహదారిని సొంత నిధులతో జేసీబీ ఏర్పాటు చేసి చెత్తాచెదారం తొలగించి చదును చేయించారు. దీంతో స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే రెండవ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన విద్యుత్ స్థంభాన్ని ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపించారు.
గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ భరోసా కల్పించడం సాయికుమార్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
చిన్న వయసులోనే సర్పంచ్గా బాధ్యతలు చేపట్టి ప్రజా శ్రేయసే లక్ష్యంగా పనిచేస్తున్న సాయికుమార్కు గ్రామ పెద్దలు, యువత, ప్రజలు మేము నీవెంటే అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి