Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పూర్తిస్థాయి కమిషనర్‌ను వెంటనే నియమించాలి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల డిమాండ్. నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 07:38 PM

సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్

సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్

సొంత నిధులతో గ్రామాభివృద్ధికి దూసుకెళ్తున్న యువ సర్పంచ్
December 25, 2025 09:12 AM 65,942 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న యువ సర్పంచ్

ప్రభుత్వం కాదు, సంకల్పమే బలం – సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధి చేస్తున్న యువ సర్పంచ్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

చేయాలనే తపన ఉంటే అభివృద్ధి ఆగదని బోగారం గ్రామ యువ సర్పంచ్ కునూరు సాయికుమార్ నిరూపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.

పదవి లేనప్పుడే పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల మధ్యే తిరుగుతూ సమస్యలను గుర్తించిన సాయికుమార్, సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఉత్సాహంతో పనులు వేగవంతం చేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఏండ్ల నాటి సమస్యగా మారిన వికాస్ ఫంక్షన్ హాల్ నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ఉన్న గ్రామపంచాయతీ రహదారిని సొంత నిధులతో జేసీబీ ఏర్పాటు చేసి చెత్తాచెదారం తొలగించి చదును చేయించారు. దీంతో స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే రెండవ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతన విద్యుత్ స్థంభాన్ని ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపించారు.

గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ భరోసా కల్పించడం సాయికుమార్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే గ్రామ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.

చిన్న వయసులోనే సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి ప్రజా శ్రేయసే లక్ష్యంగా పనిచేస్తున్న సాయికుమార్‌కు గ్రామ పెద్దలు, యువత, ప్రజలు మేము నీవెంటే అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.

మీ స్పందన? 7 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News