Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 09, 2026 03:35 PM

పులిగిల్లలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

పులిగిల్లలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

పులిగిల్లలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
July 09, 2026 12:55 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు వలిగొండ మండలం పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకత్వానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఉప సర్పంచ్ వడ్డేమాన్ దేవేందర్, వార్డు సభ్యులు బుగ్గ క్రిష్ణ, సిలువేరు మహేష్,బండారి యాదయ్య, బుగ్గ మనోజ్, మాజీ ఉప సర్పంచ్ ఫైళ్ల రవీందర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి నక్కల నవాబు రెడ్డి,బుగ్గ శీను,బొబ్బల నరసింహ రెడ్డి. బందారపు నరేష్, మేరుగు. కృష్ణ,కాసాని పద్మయ్య. కొమ్మిడి. వెంకట్ రెడ్డిబుగ్గ మల్లయ్య,వేముల నరసింహ, వేముల అశోక్, పల్లెర్ల స్వామి, రామోజీ, ఈ కార్యక్రమం ఇంచార్జ్ బండారి. రాజు,వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News