హైదరాబాద్,
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని 1908 హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు, అవగాహన, వ్యసనపరులకు చికిత్స–పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ–సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి