పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ
పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ
Komidala Mahender reddy
చిట్యాల, జూలై 8: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో బుధవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని చెట్లుగా పెంచే బాధ్యతను కూడా ప్రతి కుటుంబం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజి రాజు, వార్డు సభ్యులు సాపిడి అనిత అశోక్, గ్రామ పెద్దలు లడే రాములు, బేబిరి సోమయ్య, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి