Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ
08-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 8: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో బుధవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని చెట్లుగా పెంచే బాధ్యతను కూడా ప్రతి కుటుంబం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజి రాజు, వార్డు సభ్యులు సాపిడి అనిత అశోక్, గ్రామ పెద్దలు లడే రాములు, బేబిరి సోమయ్య, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


Sthanikam

పచ్చదనం కోసం ఆరెగూడెం అడుగు.. గ్రామంలో ఘనంగా మొక్కల పంపిణీ

Article Image

చిట్యాల, జూలై 8: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో బుధవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని చెట్లుగా పెంచే బాధ్యతను కూడా ప్రతి కుటుంబం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, గ్రామాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుంజి రాజు, వార్డు సభ్యులు సాపిడి అనిత అశోక్, గ్రామ పెద్దలు లడే రాములు, బేబిరి సోమయ్య, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News