నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు
నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు
Anjali
శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు) చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించడంలో జిల్లా ఆహార భద్రతా అధికారులు పూర్తిగా విఫలమయ్యారనిAISU జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ RSF రాష్ట్ర సహాయ కార్యదర్శి సాకే హరి కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందని విమర్శించారు. అనేక హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యం, నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టళ్లలో ఆహార నాణ్యతను తనిఖీ చేయాల్సిన జిల్లా ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఏనాడూ వసతి గృహాలను సందర్శించిన దాఖలాలు లేవు. అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారు," అని వారు మండిపడ్డారు.
ప్రధాన డిమాండ్లు:
జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన జిల్లా ఆహార భద్రతా అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులకు మెనూ ప్రకారం స్వచ్ఛమైన, పౌష్టిక ఆహారం అందేలా శాశ్వత నిఘా ఏర్పాటు చేయాలి కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి