Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:23 AM

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి  పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు
06-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు) చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించడంలో జిల్లా ఆహార భద్రతా అధికారులు పూర్తిగా విఫలమయ్యారనిAISU జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ RSF రాష్ట్ర సహాయ కార్యదర్శి సాకే హరి కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందని విమర్శించారు. అనేక హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యం, నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టళ్లలో ఆహార నాణ్యతను తనిఖీ చేయాల్సిన జిల్లా ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఏనాడూ వసతి గృహాలను సందర్శించిన దాఖలాలు లేవు. అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారు," అని వారు మండిపడ్డారు.

ప్రధాన డిమాండ్లు:

జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన జిల్లా ఆహార భద్రతా అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

విద్యార్థులకు మెనూ ప్రకారం స్వచ్ఛమైన, పౌష్టిక ఆహారం అందేలా శాశ్వత నిఘా ఏర్పాటు చేయాలి కోరారు.

Sthanikam

నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు) చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించడంలో జిల్లా ఆహార భద్రతా అధికారులు పూర్తిగా విఫలమయ్యారనిAISU జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ RSF రాష్ట్ర సహాయ కార్యదర్శి సాకే హరి కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందని విమర్శించారు. అనేక హాస్టళ్లలో పురుగులు పట్టిన బియ్యం, నాణ్యత లేని కూరగాయలతో వంటలు చేస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.హాస్టళ్లలో ఆహార నాణ్యతను తనిఖీ చేయాల్సిన జిల్లా ఆహార భద్రతా అధికారులు (Food Safety Officers) ఏనాడూ వసతి గృహాలను సందర్శించిన దాఖలాలు లేవు. అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆరోగ్యాలతో నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారు," అని వారు మండిపడ్డారు.

ప్రధాన డిమాండ్లు:

జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో తక్షణమే ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన జిల్లా ఆహార భద్రతా అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

విద్యార్థులకు మెనూ ప్రకారం స్వచ్ఛమైన, పౌష్టిక ఆహారం అందేలా శాశ్వత నిఘా ఏర్పాటు చేయాలి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News