డిజిటల్ సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్తో కీలక సమావేశం
డిజిటల్ సభ్యత్వ నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్తో కీలక సమావేశం
Editor Desk
నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం
హైదరాబాద్: పార్టీ సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఎర్రవెల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సాగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ నమోదు ప్రక్రియపై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
మూడ్రోజుల్లో సభ్యత్వ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర కమిటీ నుంచి ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి