Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 01:54 PM

న్యాయం కోసం వెళ్తే నమ్మించి మోసం వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు.. సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదు

న్యాయం కోసం వెళ్తే నమ్మించి మోసం వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు.. సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదు

న్యాయం కోసం వెళ్తే నమ్మించి మోసం వివాహితపై లైంగిక దాడి ఆరోపణలు.. సీఐ రాజు నాయక్‌పై కేసు నమోదు
May 20, 2026 04:51 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహించిన సీఐ బానోత్ రాజు నాయక్‌పై వివాహిత మహిళపై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పలువురు అధికారులను కలవరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిసింది.

పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళ తన భర్త వేధింపులపై న్యాయం కోరుతూ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆ సమయంలో అక్కడ సీఐగా పనిచేస్తున్న రాజు నాయక్, తాను సహాయం చేస్తానని, న్యాయం జరిగేలా చూస్తానని నమ్మకం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ప్రేమ, వివాహం పేరుతో ఆమెను మోసం చేసి లైంగికంగా దోపిడీ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

కొంతకాలానికి బాధిత మహిళ గర్భవతి కావడంతో వివాహంపై ప్రశ్నించగా, సీఐ రాజు నాయక్ ఒత్తిడి తెచ్చి గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాత్రలు బలవంతంగా మింగించి అబార్షన్‌కు పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించినట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీన ఆమె అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా, ఆరోపణల్లో నిజానిజాలు ఉన్నట్లు తేలినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని సీఐ రాజు నాయక్‌ను విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న పోలీసు అధికారిపైనే ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధిత మహిళకు పూర్తి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News