ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ
ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా,లో పారదర్శకమైన, దోషరహితమైన ఓటర్ల జాబితా (క్లీన్ ఈ-రోల్) రూపకల్పన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను తక్షణమే పూర్తి చేసి సంబంధిత అధికారులకు తిరిగి అందజేయాలని జిల్లా యంత్రాంగం కోరుతోంది.
ప్రజలందరూ ఇప్పుడే వెళ్ళి తమ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను తమ ప్రాంత బూత్ స్థాయి అధికారికి (BLO) తెలియజేయాలని, తద్వారా ఓటర్ల జాబితా పరిశుద్ధత ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడమైనది. ఓటు వివరాల నమోదు, మార్పులు లేదా చేర్పులపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. ప్రజలు తమ మొబైల్లోని ‘ఓటర్ హెల్ప్లైన్ యాప్’ (Voter Helpline App) ద్వారా నేరుగా తమ బీఎల్ఓ (BLO) తో కాల్ బుక్ చేసుకుని మాట్లాడే సరికొత్త సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కావున ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఓటరు జాబితా నాణ్యతను పెంచేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి