Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:18 PM

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి
July 11, 2026 06:07 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులకు యూరియా ఎరువులు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 96,150 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న రైతులు తమకు సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను బుక్ చేసుకుని 15 రోజులలోపు వెళ్లి పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో 70,934 బస్తాలు సిద్ధంగా ఉండగా అవసరాన్ని బట్టి వెంటనే విక్రయ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. యూరియా కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని ఎవరైనా బలవంతం చేస్తే అంగీకరించవద్దని సూచించారు. నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News