Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి
11-07-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైతులకు యూరియా ఎరువులు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 96,150 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న రైతులు తమకు సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను బుక్ చేసుకుని 15 రోజులలోపు వెళ్లి పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో 70,934 బస్తాలు సిద్ధంగా ఉండగా అవసరాన్ని బట్టి వెంటనే విక్రయ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. యూరియా కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని ఎవరైనా బలవంతం చేస్తే అంగీకరించవద్దని సూచించారు. నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

"యూరియా కొరత లేదు.. యాప్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోండి

Article Image

రైతులకు యూరియా ఎరువులు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 96,150 యూరియా బస్తాలు అందుబాటులో ఉండగా, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న రైతులు తమకు సమీపంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియాను బుక్ చేసుకుని 15 రోజులలోపు వెళ్లి పొందవచ్చని తెలిపారు. జిల్లాలోని వివిధ మండలాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో 70,934 బస్తాలు సిద్ధంగా ఉండగా అవసరాన్ని బట్టి వెంటనే విక్రయ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. యూరియా కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని ఎవరైనా బలవంతం చేస్తే అంగీకరించవద్దని సూచించారు. నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News