Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:18 AM

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..
11-07-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం.

రామన్నపేటలో భారీ బహిరంగ సభ.ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా నిలిచే పలు మౌలిక వసతుల పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్యటనలో భాగంగా నార్కట్‌పల్లి మండలంలో ప్రతిష్ఠాత్మక రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత రామన్నపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

మంత్రి పర్యటన విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పార్కింగ్, వేదిక నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మంత్రి పర్యటనతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Sthanikam

నకిరేకల్‌కు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి రైల్వే ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన..

Article Image

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణకు శ్రీకారం.

రామన్నపేటలో భారీ బహిరంగ సభ.ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా నిలిచే పలు మౌలిక వసతుల పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్యటనలో భాగంగా నార్కట్‌పల్లి మండలంలో ప్రతిష్ఠాత్మక రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చిట్యాల–భువనగిరి ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత రామన్నపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు.

మంత్రి పర్యటన విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పార్కింగ్, వేదిక నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మంత్రి పర్యటనతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News