ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన
ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన
Editor Desk
రోడ్లు, వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు
రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేడు (జూలై 12, ఆదివారం) నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ల విస్తరణ, బలోపేతం పనులతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు.
మంత్రి పర్యటన షెడ్యూల్:
- ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రి నివాసం నుంచి బయలుదేరుతారు.
- ఉదయం 9:00 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని రాశి కంపెనీ సమీపంలో CRIF నిధులతో నార్కట్పల్లి–మునుగోడు రోడ్డుపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు శంకుస్థాపన చేస్తారు.
- ఉదయం 10:00 గంటలకు నార్కట్పల్లి నుంచి రామన్నపేటకు బయలుదేరుతారు.
- ఉదయం 11:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్యాకేజీ-1 కింద రోడ్ల విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేస్తారు.
- మధ్యాహ్నం 12:00 గంటలకు రామన్నపేట నుంచి వంగపల్లికి బయలుదేరుతారు.
- మధ్యాహ్నం 1:00 గంటకు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ప్యాకేజీ-2 కింద రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
- అనంతరం హైదరాబాద్లోని బంజారాహిల్స్కు తిరుగు ప్రయాణమవుతారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి