నల్గొండలో మెడ్ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు
నల్గొండలో మెడ్ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు
Editor Desk
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, బస్టాండ్–పానగల్ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ప్లస్ మెడికల్ షాపును ఆదివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత–రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెడ్ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ జై వీరస్వామి మాట్లాడుతూ.. నాణ్యమైన మందులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి గురువారం మలక్పేట యశోద ఆస్పత్రికి చెందిన నిపుణులైన వైద్యులు మెడ్ప్లస్ కేంద్రంలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందుబాటు ధరల్లో అందజేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మలక్పేట యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గుత్తా శశిధర్ రెడ్డి, డాక్టర్ ఉప్పలపాటి యోగేంద్ర, ఆస్పత్రి సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి