వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
Komidala Mahender reddy
రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మీయా ఇంటి ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు రామన్నపేట సబ్ఇన్స్పెక్టర్ జి. సతీష్కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఎం. వెంకటేశ్వర్లు, నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తిలతో కూడిన బృందం బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆకస్మికంగా దాడి నిర్వహించింది.పోలీసులను గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని గోదుమల సంగప్ప, కొయ్యలకారి రాజు, కొయ్యలకారి రాము, ఎస్.కె. జానీ మీయాలుగా గుర్తించారు.నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, రెండు సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి. సతీష్ వెల్లడించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి