Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
09-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మీయా ఇంటి ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు రామన్నపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. సతీష్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఎం. వెంకటేశ్వర్లు, నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తిలతో కూడిన బృందం బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆకస్మికంగా దాడి నిర్వహించింది.పోలీసులను గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని గోదుమల సంగప్ప, కొయ్యలకారి రాజు, కొయ్యలకారి రాము, ఎస్.కె. జానీ మీయాలుగా గుర్తించారు.నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, రెండు సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి. సతీష్ వెల్లడించారు.

Sthanikam

వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

Article Image

రామన్నపేట, జూలై 9: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఎస్.కె. జానీ మీయా ఇంటి ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు రామన్నపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ జి. సతీష్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఎం. వెంకటేశ్వర్లు, నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తిలతో కూడిన బృందం బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆకస్మికంగా దాడి నిర్వహించింది.పోలీసులను గమనించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని గోదుమల సంగప్ప, కొయ్యలకారి రాజు, కొయ్యలకారి రాము, ఎస్.కె. జానీ మీయాలుగా గుర్తించారు.నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, రెండు సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ జి. సతీష్ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News