PRINT TIME: July 08, 2026 10:32 PM
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
July 08, 2026 09:02 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జోగిపేట చేనేత సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్మికులు, వారి కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు సంఘంలో పారదర్శకంగా, అందరికీ న్యాయం జరిగేలా పాలన సాగించాలని సూచించారు. అలాగే త్వరలోనే చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని, అందరి సలహాలు తీసుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నూతన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి