Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:24 AM

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు
08-07-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు

* పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్‌: ఎండి ఖయ్యూం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలోని రాజీవ్ స్మారక భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ స్మారక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామ్ చందర్, రాజీవ్ స్మారక ట్రస్ట్ అడ్వైజర్ నల్ల నరసింహ, చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, ఓబీసీ మున్సిపల్ అధ్యక్షులు ఆవుల యేసు యాదవ్, ఐఎన్ టీయూసీ బ్లాక్ అధ్యక్షులు కచ్చర్ల జగ్గయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాని గోపాల్, మాజీ షాదీఖానా చైర్మన్ ఎండి అజాజ్, ఐఎన్‌టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుర్కంటి భగవత్ రెడ్డి, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Article Image

* మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు

* పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్‌: ఎండి ఖయ్యూం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలోని రాజీవ్ స్మారక భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ స్మారక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామ్ చందర్, రాజీవ్ స్మారక ట్రస్ట్ అడ్వైజర్ నల్ల నరసింహ, చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, ఓబీసీ మున్సిపల్ అధ్యక్షులు ఆవుల యేసు యాదవ్, ఐఎన్ టీయూసీ బ్లాక్ అధ్యక్షులు కచ్చర్ల జగ్గయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాని గోపాల్, మాజీ షాదీఖానా చైర్మన్ ఎండి అజాజ్, ఐఎన్‌టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుర్కంటి భగవత్ రెడ్డి, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News