చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన మెండే నరసింహ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి చేరుకుని పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ కౌన్సిలర్ జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, 9వ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆగు అశోక్ యాదవ్ తదితరులు పాల్గొని మెండే నరసింహకు ఘనంగా నివాళులర్పించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి