Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత
08-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

హనుమకొండ, జూలై 8: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషాద వార్త స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిన నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే చికిత్స కొనసాగుతున్న సమయంలో నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరంజన్ మృతి పట్ల స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

"అభిమాని కోసం ఇంటికెళ్లిన పవన్.. చివరకు విషాదాంతం.. నిరంజన్ మృతితో విషాదంలో అభిమానులు" అంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

Sthanikam

పవన్ అభిమానిని మృత్యువు కబళించింది.. నిరంజన్ కన్నుమూత

Article Image

హనుమకొండ, జూలై 8: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషాద వార్త స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిన నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే చికిత్స కొనసాగుతున్న సమయంలో నిరంజన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరంజన్ మృతి పట్ల స్థానిక ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

"అభిమాని కోసం ఇంటికెళ్లిన పవన్.. చివరకు విషాదాంతం.. నిరంజన్ మృతితో విషాదంలో అభిమానులు" అంటూ పలువురు నివాళులర్పిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News